శనివారం, ఆగస్టు 04, 2012

ఇల్లు కొంటున్నారా, కొనేముందు జాగ్రత్తలు


 
సామాన్యుడికి సొంతిల్లు, సొంత ప్లాటు ఓ అందమైన కల. జీవితంలో ఎన్నో సంవత్సరాలు చమటోడ్చి కూడబెట్టిన డబ్బుతో  ఆ కలను సాకా రం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. శక్తికిమించిన కోరికైనా శక్తిమేరకు ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో ఎన్నో విషయాలను తెలుసుకోవాలి.నిర్మాణ రంగంలోని లొసుగులు,  స్థలానికి చెందిన లావాదే వీలు, అక్రమనిర్మాణాలు, అబద్దపు లేఅవ్ఞట్‌లు, దర్జాను వెలగబోస్తున్న దళారీలు, వేలాలు, ప్రత్యా మ్నయ ఆఫర్‌లు, జిగేల్‌మనిపించే లక్కీ స్కీంల ఆకర్షణలు వీటన్నింటి మధ్య దిక్కుతోచకుండా నిలబడతాడు వినియోగదారుడు. ఆచితూచి అడుగు వేయాలంటే కాసింత అవగాహన అవసరం మరి.ఇల్లుకొనేముందు మీరు వీటిని ఖచ్చితంగా తెలుసు కోవాలి. లేకపోతే మీరు అమితంగా నష్టపోవాల్సి వస్తుంది
1.ఫ్లాట్‌ బుక్‌ చేసేటప్పుడు మీరు బిల్డర్‌ నేప థ్యాన్ని, అతని గత పనితీరుని గురించి వెరిఫై చేయాలి. ఫ్లాట్‌/ప్లాటు ఎటువంటి అక్రమణలు, లిటిగేషన్లకు గురికాలేదని కూడా నిర్ధారించు కోవాలి.బిల్డర్‌ మున్సిపల్‌, ఇతర ఆథారిటీల నుండి అవసరమైన క్లియరెన్సులు, అనుమతులు అన్నీ పొందాడనికి, లే అవుట్‌ అనుమతించబడిందని నిర్ధారించుకోవాలి.
2.నిర్మాణం/అభివృద్ధి జరిగే చోటును రెగ్యులర్‌గా సందర్శిస్తూ ఆయా తేదీలలో వాటికి తగిన డాక్యుమెంటేషన్‌, ఫోటోగ్రాఫ్‌లను రుజువుగా ఉంచుకోవాలి. బిల్డర్‌కు మీకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఒక ఫైలులో పెట్టాలి.
అంగీకారం కుదుర్చుకోవడానికి ముందుగానే బిల్డర్‌ చేసిన అడ్వర్‌టైజ్‌మెంట్లు, వాగ్దానాలను చర్చించాలి. వాగ్దానాలన్నీ అంగీకారంలో సరిగ్గా చేరేటట్లు చూడాలి.బిల్డర్‌తో అంగీకారం కుదుర్చుకునేటప్పుడు, పొసెషన్‌ ఇచ్చేకాల వ్యవధి పరస్పరం అంగీక రించినట్లుగా పేర్కొనబడిందా అనేది నిర్ధారించు కోవాలి. భవనం వివిధ దశలకు సంబంధించిన కాల వ్యవధులను అంగీకారంలో చేరేటట్లు చూడాలి.
3.నిర్మాణంలో దశల ఆధారంగా వాయిదాలు చెల్లించవలసి ఉంటే, ఇరుపక్షాలలో ఎవరైనా ఆలస్యం చేస్తే తలెత్తే పరణామాల గురించి చర్చించి, అంగీకారానికి రావాలి.చెల్లింపు షరతులను మీరు స్పష్టంగా పేర్కొనాలి. అవసరమైతే పార్కింగ్‌ స్పేస్‌ వినియోగం గురించికూడా తెలుసుకోవాలి.కార్పెట్‌ ఏరియా, బిల్డప్‌ ఏరియా, సూపర్‌ బిల్డప్‌ ఏరియా మొదలైన అంశాలకు అర్ధం బిల్డర్‌ను, రాష్ట్రాన్నిబట్టి మారుతుంటాయి. సమయానుసారంగా కూడా వీటిలో మార్పులొ స్తాయి. వాటిని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. అంగీకారంపై సంతకం చేసే ముందు వాటిని స్పష్టంగా వెల్లడించి అంగీకారంలో చేర్చాలి. నిర్మాణం, ఫిక్సర్లు, ఫిట్టింగుల నాణ్యతను కూడా అగ్రిమెంటు స్పష్టం చేయాలి.
4.బిల్డరు చర్యలవల్ల అనేకమంది కొనుగోలుదా రులు నష్టపోయినట్లయితే సముదాయంగా, సొసైటీగా ఒకే ఫిర్యాదును దాకలు చేసే విషయాన్ని పరిశీలించండి. నష్టం ఒక కోటి  రూపాయలు దాటితే, జాతీయ కమిషన్‌ ఎదుట 20లక్షల నుండి ఒక కోటి రూపాయల మధ్య ఉంటే, రాష్ట్ర కమిషన్‌ ఎదుట 20 లక్షల తక్కువ ఉంటే ఫోరంలో ఫిర్యాదు చేయాలి.
మీ చిరునామా మార్పును లిఖిత పూర్వకంగా బిల్డర్‌కు తెలపండి.ఫిర్యాదు దాఖలు చేసేటప్పుడు గుర్తుంచుకో వలసిన అతిముఖ్యమైన అంశం పరిమితి. చర్య జరిగిన 2 సంవత్సరాలలోపు మీరు ఫిర్యాదు దాఖలు చేయాలి. ఈ పరిమితి ఉండడం వల్ల మీ లేఖలు బిల్డర్‌ జవాబు ఇవ్వడని తెలిసి కూడా ఎదురుచూస్తూ కూర్చోవడం, అంగీక రించినట్లుగా నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఎదురుచూడటం వల్ల మీ కేసుకు ప్రయోజనం ఉండదు.సహకార సంఘాల సభ్యులు వినియోగదారుల రక్షణ చట్టం కింద ఉపశమనం క్లెయిం చేసుకో వచ్చు. కారు పార్కింగ్‌ రోడ్లు, నీరు, విద్యుత్తు, ఇతర సదుపాయాలను కల్పిస్తామనే హామీ ఒప్పందంలో పేర్కొన్నప్పటికీ పొసెషన్‌ సమయం లో వాటిని కల్పించని అనేక కేసుల్లో హౌజింగ్‌ సొసైటీల ఉపశమనం అందించడం జరిగింది.
5.ఇంటిని కొనే ముందు డాక్యుమెంట్ల పరిశీలన:ఎప్పుడైనా ఒక భూమిని లేదా ఇం టిని కొనుగోలు చేసే ముందు అం దుకు సంబంధించిన క్రయ, వి క్రయాల ఒప్పందాలను రెండుమార్లు తనిఖీలు చేసుకోవాల్సిన అవసర ముంది. రియల్‌ ఎస్టేట్‌లో కూడా న కిలీ యాజమాన్యాలు నేడు అధి కమవుతున్నాయి. కొందరు వ్యక్తులు అప్పటికే వేరే వారికి అమ్మిన స్థ లాలను మళ్లీ ఇతరులకు అమ్మేం దుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే ఫ్లాట్లు, ప్ల్లాట్ల విషయంలో కూడా ఇటువంటివి అనేకం జరుగుతు న్నాయి. ఇటువంటి రియల్‌ ఎస్టేట్‌ మోసగాళ్లు అప్పటికే మార్టిగేజ్‌ అ యిన భూములనే మళ్లీ విక్రయి స్తుంటారు.ఆ విధంగా అమ్మేసిన తర్వాత సీన్‌ నుంచి తప్పుకుని పరారయ్యే పరిస్థితులు ఉన్నాయి. భాగ్యనగర పరిధిలో ఆస్తుల మో సాలు నానాటికీ అధికమవుతున్నా యి. దీనికి కారణం భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడమే. కొన్ని సందర్భాల్లో భూమి క్రయ, విక్ర యాలకు సంబంధించి ' బూమ్‌ లే కపోయినప్పటికీ, స్థలాల రేట్లు ఎ క్కువగానే ఉంటున్నాయి. అందువల్ల తక్కువ ధరలకు భూములను కొనుగోలు చేసి, ఆ తర్వాత వాటిని ఎక్కువ ధరకు విక్రయించేందుకు కొంతమంది సిద్ధమవుతున్నారు. ఈ దశలోనే అసలు బండారం బయట పడుతుంది. ఒరిజనల్‌ భూములకు సంబంధించిన పత్రాలలో గోల్‌మాల్‌ జరిగిందని తెలుస్తుంది.
అయితే ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో దాదా పు అయిదు వందలకు పైగా ఆస్తుల మోసాలకు సంబంధించి కేసులు నమోదు అవుతున్నాయని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. హైదరా బాద్‌ నగర శివారుల్లోని కొండాపూర్‌, మాదాపూర్‌, దిండిగల్‌, ఘట్‌కేసర్‌, శంషాబాద్‌, శామీర్‌పేట, చౌటుప్ప ల్‌, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో ప్రాఫర్టీ మోసం కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ ఏరి యాల్లో డాక్యుమెంట్లను తారుమారు చేసి భూములను విక్రయిస్తున్నట్లు వెల్లడవుతోంది.
6.కొన్ని సందర్భాల్లో ప్రవాస భారతీయులు వేరే దేశంలో ఉంటారు. వారు ఇక్కడ తమ భూ ముల స్థితిగతుల గురించి ఎక్కువగా పట్టించుకునే పరిస్థితులు ఉండవు. అటువంటి సందర్భాల్లో కొందరు దళారీ వ్యాపారులు ఎన్‌ఆర్‌ఐలకు తెలియకుండా వారి భూములను నకిలీ డాక్యుమెంట్లతో అమ్మేస్తున్నా రు. డబ్బు ఉత్తిపుణ్యాన నష్టపోతే ఎవరైనా బాధ పడాల్సిందే. మళ్లీ డబ్బు సంపాదించుకోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది.అందు వల్ల భూములు, స్థలాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసే సమయంలో అసలు ఆ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసు కోవాలి. అత్యవసర పరిస్థితిలో న్యా యనిపుణుల సలహాలను స్వీకరిం చాలి. అంతేగాక భూముల కొనుగోలు దారులు ప్రాఫర్టీ మోసాలకు చిక్కుకోకుండా తగిన జాగ్రత్తలు తీసు కోవాలి.
 7.పొదుపు చేసి గృహాలు కొను కో్కవడం.. : బ్యాంకు వడ్డీలతో కాకుండా ఉద్యోగాల్లో చేరిన తర్వాత చాలా మంది పోస్టు రిటైర్మెంట్‌ స్కీం లో పొదుపు చేస్తుంటారు. ఇవి ఎంత తొందరగా మొదలుపెడితే అంత మంచిది. ఇన్సురెన్సు, పెన్షన్‌ స్కీంలు చాలా చౌక. దీని మీద రాబడి మాత్రం ఎక్కువగానే వస్తుందని చెప్పాలి. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ఈ స్కీంల లో చేరిన వారి ఇవి చక్కగా పనికి వస్తాయి. ఇవే స్కీంలు మధ్య వయస్సు లో ప్రారంభిస్తే పెద్ద మొత్తంలో ప్రీమియంలు చెల్లిం చాల్సి వస్తుంది. ఇన్సురెన్సు, పెన్షన్‌ స్కీంల ద్వారా రుణాలు పొందాలి... దానితో పాటు అదనంగా కొన్ని పొదుపు చేసిన సొమ్ము జతైతే ఈఎంఐలు పెద్ద ఎత్తున చెల్లించాల్సిన బాధ ఉండదు. దానితో పాటు లోన్‌ అవుట్‌స్టాం డింగ్‌ అనేది తగ్గుకుంటూ వస్తుంది. మీరు రుణం చెల్లింపు వాయిదాలు కూడా తొందర గా తీరిపోతాయి. తర్వాత మీరు రుణ విముక్తులయ్యారు కాబట్టి భవిష్యత్తు గురించి చక్కటి ప్లానింగ్‌కు తీరిక అవాకశం కూడా దొరుకుతంది.
8.ఇంటి ధర : ఈ నేపథ్యంలో రోజు రోజుకు ముడిపదా ర్థాల రేటు పెరగడంతో పాటు ఇంటి ధరలు కూడాచుక్కలనంటుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితేనష్టం వచ్చే అవకాశం లేకపోయినా.. గతంలో ఇంటి ధరల్లో కరెక్షను వచ్చిన సంఘనలు కూడా ఉన్నా యి. డిమాండ్‌ సప్లయ్‌ సూత్రం ఆధారంగా మ ళ్లీ ధరలు పెరిగాయి. మన పట్టణాలు, నగరాల్లో రోజు రోజుకు జనాభా పెరుగుతూపోతోంది కాబట్టి రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబ డులకు ఢోకా మాత్రం లేదనే చెప్పాలి. అందకే .. వీలైనంత తొందరగా ఇళ్లు కొనుగోలు చేసి.. చెల్లింపులు కూడా త్వరగా ముగుస్తాయి.

9.పదవీ విరమణ తర్వాత ప్రశాంతంగా జీవింవచ్చు. మన పెట్టుబడులకు తగ్గ విలువ దక్కాలంటే.. నగరం చుట్టు పక్కల ఎక్కడైనా త్వరగా అభివృద్ధి చెందుతుందనే అవకాశం ఉంటే ఆలస్యం చేయకుండా పెట్టుబడులు పెట్టడం మంచిది. అదే ప్రాంతంలో వాణిజ్య సముదాయాలు లాంటి ప్రాజెక్టులు వస్తే ... మీరు కొనుగోలు చేసిన ఆస్తికి మంచి విలువ ఉంటుంది. తర్వాత ఆ ఆస్తిని విక్రయించి సొమ్ము చేసుకుని లాభం గడించి కొత్త ప్రాంతానికి వెళ్లి మరో ఆస్తిని కొనుగోలు చేసుకోవచ్చు. భవిష్యత్తులో భారత్‌లో కూడా పశ్చిమ దేశాల మాదిరిగా రివర్స్‌ మార్టిగేజ్‌ కాన్సెప్ట్‌ వచ్చే అవకాశం ఉంది. అందుకే జీవితం లో వీలైనంత తొందరగా ఇల్లు కొను గోలు చేసి మంచి లాభాలు గడిం చే ఆస్కారా న్ని చేజార్చుకో రాదని రియల్‌ ఎస్టేట్‌ ని పుణులు సలహా ఇస్తున్నారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి