జలుబు చేస్తే
- వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రి త్రాగితే తెల్లారేసరికల్లా జలుబు పోవును.
- పొద్దున్నే వేడి పాలలో, మిరియాల పొడి (వీలుంటే శోంఠి ) వేసుకోని కలిపి వేడివేడిగా త్రాగండి
- ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచుకొని అందులో పసుపు వేసుకొని చెమటలు పట్టె దాకా ఆవిరి పడితె చాలా తేడా కనిపిస్తుంది. దానిలో కాస్త అమృతాంజనం వేస్తే ఇంకా ప్రభావం కనిపిస్తుంది.
- అరవై మిల్లీ లీటర్ల వోడ్కా రాత్రి తాగితే తెల్లారేసరికి జలుబు ఉష్ కాకి. (పిల్లల కైతే సగం డోస్)
- తులసి, అల్లపు ముక్కల రసం తేనెతో కలిపి మూడు పూటలా సేవిస్తే జలుబు తగ్గుతుంది.
- శొంఠి, మిరియాలు, తులసి ఆకులు సమభాగంగా తీసుకుని కషాయం కాచాలి. దానికి చక్కెర చేర్చి, వేడిగా తాగితే పడిశం తగ్గుతుంది.
- ఇరవై గ్రాముల దాల్చినచెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి ఒక గ్లాసు నీటితో మరిగించి, వడగట్టి, ఒక చెంచా తేనె కలిపి వేడిగా తాగాలి.
- ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి, రోజు పరగడుపున తాగితే నిమ్మలోని 'సి' విటమిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి తొందరగా జలుబు తగ్గేలా చేస్తుంది.
- నాలుగు తులసి ఆకుల రసమ్ తాగాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి